తెలంగాణ:మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం!
- December 21, 2018తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వీటిని మనుగడలోకి తెచ్చేందుకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రజల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా కొత్తగా 2 జిల్లాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 7 మండలాల ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళిక రెవెన్యూశాఖ సిద్ధం చేస్తోంది. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అలాగే కోరుట్ల, కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గట్టుప్పల్, మల్లంపల్లి, చుండూరు, మోస్రా, ఇనుగుర్తి, నారాయణరావుపేట మండల కేంద్రాలు కానున్నాయి.
ముఖ్యమంత్రి KCR ఇప్పటికే కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుకు పాలనాపరంగా చేపట్టాల్సిన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐతే.. ఇప్పుడు మరికొన్ని డిమాండ్లు కూడా కొత్తగా తెరపైకి రావడంతో వాటిపై ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో హుజూరాబాద్ను జిల్లా చేయాలని కొత్త డిమాండ్ వినిపిస్తోంది.14 మండలాలతో దీన్ని జిల్లా చేయాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. మిర్యాలగూడ, సత్తుపల్లి కూడా జిల్లాలు చేయాలన్న వాదన బలంగా తెరపైకి వచ్చింది. ఏటూరునాగారాన్ని ఆదివాసీ జిల్లాగా చేయాలని కూడా కోరుతున్నారు. ఇవి కాకుండా మండలాల డిమాండ్లయితే కోకొల్లలుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్