రెండు లక్షల మందితో ఏపీలో మోదీ సభ
- December 22, 2018
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్దమవుతోంది. నాలుగేళ్లలో కేంద్రం సాధించాన విజయాలను వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలన నిర్ణయించారు. ప్రధానమంత్రి మోడీ సభలకుఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరుతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర లలో సభలు నిర్వహించే యోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
ఇప్పటికే గుంటూరు సభకు మోడీ రాక ఖాయమైంది. దీంతో సభకు కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి సైతం భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రెండు లక్షల మందితో నిర్వహిస్తామంటున్నారు. మోదీ బహిరంగ సభతో ఏపీలో రాజకీయాలు మారిపోతాయని బీజేపీశ్రేణులు భావిస్తున్నాయి. అమరావతి శంకుస్థాపనకు నరేంద్రమోదీ మట్టి, నీళ్ళు తీసుకువచ్చారు.ఆ తరువాత ఇప్పటి వరకు ఏపీలో అడుగుపెట్టలేదు. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ప్రధాని వస్తుండడంతో ఏపీకి వరాలు కురిపిస్తారని నమ్ముతున్నారు. మోదీ సభతో ఆంద్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని కేడర్ నమ్ముతోంది.
అయితే మోదీ రాకతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ మరింత బలపడుతుందని నేతలు భావిస్తున్నారు. కానీ తెలంగాణ ఫలితాల చూసిన తర్వాత ఆశలు నీరుగారిపోతున్నాయి. పార్టీకి కొద్ధో గోప్పో బలం ఉన్న తెలంగాణలోనే కేవలం ఒక్క సీటుకు పరిమితమైంది. ఏపీలో ఒంటరిగా నే పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కూడా ఉంది. అయితే నేతలు మాత్రం ఇందుకు ధీమాగా ఉన్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మోదీ ఏపీ రావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విభజన హామీలు అమలు చేయకుండా.. ప్రత్యేక హోదా., రైల్వే జోన్ గురించి తేల్చకుండా ఏ ముఖంతో రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం మోడీ టూరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ టూరు ప్రకటనతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు సైతం ఒకరిపైఒకరు మాటల తూటాలు పేల్చుకోవడానికి వేదికగా మారింది.
తాజా వార్తలు
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..







