సునామీ బీభత్సం.. 584 మంది..
- December 23, 2018ఇండోనేషియాలో మరోసారి సునామీ బీభత్సం సృష్టించింది. సండా స్ట్రెయిట్ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తడంతో 43 మందికి పైగా మృతి చెందారు. మరో 584 మంది గాయపడ్డారని వెల్లడించారు అధికారులు. పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు తర్వాత సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడి అలజడి కారణంగా ఈ సునామీ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. సునామీ సంభవించిన సమయంలో పశ్చిమ జావా బీచ్కు సమీపంలో చాలా మంది ఉన్నారన్నారు. రెండోసారి వచ్చిన అల విధ్వంసం సృష్టించిందని వివరించారు. అంతకు ముందు భారీ పేలుడు శబ్ధం కూడా వచ్చిందన్నారు.
క్రకటోవా అనే అగ్నిపర్వతం 2 నిమిషాల 12 సెకన్ల పాటు విస్ఫోటనం చెందిందని తెలిపారు అధికారులు. దాంతో పర్వతాల మీద దాదాపు 400 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడిందని వెల్లడించారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండోనేషియాలోని పాలూ నగరాన్ని భారీ సునామీ ముంచెత్తింది. ఈ విధ్వంసం ధాటికి 2వేల మంది ప్రాణాలొదిలారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. అటు.. 2004 డిసెంబర్ 26న హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ సునామీ వల్ల ఇండోనేషియా సహా 14 దేశాల్లో 2 లక్షల 28 వేల మంది చనిపోయారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..