శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్
- December 23, 2018

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు 11 మంది మహిళలు పంబ వద్దకు చేరుకున్నారన్న సమాచారంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు భక్తులు వీరిని పంబ వద్దే అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. మదురై రోడ్డు మార్గం గుండా ఈ మహిళలు పంబకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ఆరుగురు అక్కడకు చేరుకోగా, మరో ఐదుగురు వారితో కలిశారు. వీరిలో ఆరుగురే దర్శనానికి వచ్చారని.. మిగిలిన ఐదుగురు మహిళలు.. వీరికి సహాయంగా ఉండేందుకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి చేయిదాటకుండా కేరళ ప్రభుత్వం ఆలయ పరిసరాలతోపాటు దారి పొడుగునా భారీగా భద్రతను మోహరించింది.
స్వామి దర్శనానికి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చాలామంది సంప్రదాయవాదులు అడ్డుకుంటున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా ఉన్న ఓ ఎన్జీవో సంస్థ.. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న 50 మంది మహిళలతో స్వామివారిని దర్శించుకుంటామని ప్రకటించింది. ఈక్రమంలోనే ఈ 11 మంది మహిళలు పంబ చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







