శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్
- December 23, 2018
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు 11 మంది మహిళలు పంబ వద్దకు చేరుకున్నారన్న సమాచారంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు భక్తులు వీరిని పంబ వద్దే అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. మదురై రోడ్డు మార్గం గుండా ఈ మహిళలు పంబకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ఆరుగురు అక్కడకు చేరుకోగా, మరో ఐదుగురు వారితో కలిశారు. వీరిలో ఆరుగురే దర్శనానికి వచ్చారని.. మిగిలిన ఐదుగురు మహిళలు.. వీరికి సహాయంగా ఉండేందుకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి చేయిదాటకుండా కేరళ ప్రభుత్వం ఆలయ పరిసరాలతోపాటు దారి పొడుగునా భారీగా భద్రతను మోహరించింది.
స్వామి దర్శనానికి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చాలామంది సంప్రదాయవాదులు అడ్డుకుంటున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా ఉన్న ఓ ఎన్జీవో సంస్థ.. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న 50 మంది మహిళలతో స్వామివారిని దర్శించుకుంటామని ప్రకటించింది. ఈక్రమంలోనే ఈ 11 మంది మహిళలు పంబ చేరుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ