శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్
- December 23, 2018

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు 11 మంది మహిళలు పంబ వద్దకు చేరుకున్నారన్న సమాచారంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు భక్తులు వీరిని పంబ వద్దే అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. మదురై రోడ్డు మార్గం గుండా ఈ మహిళలు పంబకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ఆరుగురు అక్కడకు చేరుకోగా, మరో ఐదుగురు వారితో కలిశారు. వీరిలో ఆరుగురే దర్శనానికి వచ్చారని.. మిగిలిన ఐదుగురు మహిళలు.. వీరికి సహాయంగా ఉండేందుకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి చేయిదాటకుండా కేరళ ప్రభుత్వం ఆలయ పరిసరాలతోపాటు దారి పొడుగునా భారీగా భద్రతను మోహరించింది.
స్వామి దర్శనానికి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చాలామంది సంప్రదాయవాదులు అడ్డుకుంటున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా ఉన్న ఓ ఎన్జీవో సంస్థ.. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న 50 మంది మహిళలతో స్వామివారిని దర్శించుకుంటామని ప్రకటించింది. ఈక్రమంలోనే ఈ 11 మంది మహిళలు పంబ చేరుకున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







