శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

- December 23, 2018 , by Maagulf
శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

 

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లేందుకు 11 మంది మహిళలు పంబ వద్దకు చేరుకున్నారన్న సమాచారంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు భక్తులు వీరిని పంబ వద్దే అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. మదురై రోడ్డు మార్గం గుండా ఈ మహిళలు పంబకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ఆరుగురు అక్కడకు చేరుకోగా, మరో ఐదుగురు వారితో కలిశారు. వీరిలో ఆరుగురే దర్శనానికి వచ్చారని.. మిగిలిన ఐదుగురు మహిళలు.. వీరికి సహాయంగా ఉండేందుకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి చేయిదాటకుండా కేరళ ప్రభుత్వం ఆలయ పరిసరాలతోపాటు దారి పొడుగునా భారీగా భద్రతను మోహరించింది.

స్వామి దర్శనానికి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చాలామంది సంప్రదాయవాదులు అడ్డుకుంటున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా ఉన్న ఓ ఎన్జీవో సంస్థ.. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న 50 మంది మహిళలతో స్వామివారిని దర్శించుకుంటామని ప్రకటించింది. ఈక్రమంలోనే ఈ 11 మంది మహిళలు పంబ చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com