సునామీ బీభత్సం.. 584 మంది..
- December 23, 2018ఇండోనేషియాలో మరోసారి సునామీ బీభత్సం సృష్టించింది. సండా స్ట్రెయిట్ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తడంతో 43 మందికి పైగా మృతి చెందారు. మరో 584 మంది గాయపడ్డారని వెల్లడించారు అధికారులు. పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు తర్వాత సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడి అలజడి కారణంగా ఈ సునామీ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. సునామీ సంభవించిన సమయంలో పశ్చిమ జావా బీచ్కు సమీపంలో చాలా మంది ఉన్నారన్నారు. రెండోసారి వచ్చిన అల విధ్వంసం సృష్టించిందని వివరించారు. అంతకు ముందు భారీ పేలుడు శబ్ధం కూడా వచ్చిందన్నారు.
క్రకటోవా అనే అగ్నిపర్వతం 2 నిమిషాల 12 సెకన్ల పాటు విస్ఫోటనం చెందిందని తెలిపారు అధికారులు. దాంతో పర్వతాల మీద దాదాపు 400 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడిందని వెల్లడించారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండోనేషియాలోని పాలూ నగరాన్ని భారీ సునామీ ముంచెత్తింది. ఈ విధ్వంసం ధాటికి 2వేల మంది ప్రాణాలొదిలారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. అటు.. 2004 డిసెంబర్ 26న హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ సునామీ వల్ల ఇండోనేషియా సహా 14 దేశాల్లో 2 లక్షల 28 వేల మంది చనిపోయారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..