కాసేపట్లో విశాఖకు పయనమవ్వనున్న తెలంగాణ దొర
- December 23, 2018
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠాన్ని ఆయన సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న కేసీఆర్..మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శారదాపీఠానికి వెళ్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశీర్వచనం తీసుకుంటారు.
దాదాపు రెండు గంటలసేపు పీఠంలోనే కేసీఆర్ గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు స్వామీజీ ఆధ్వర్యంలో కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇక.. విశాఖ పర్యటన అనంతరం కేసీఆర్.. భువనేశ్వర్ వెళ్తారు.
కేసీఆర్ వ్యక్తిగత భద్రత ఏర్పాట్లను తెలంగాణ నుంచి వచ్చే బలగాలు చూసుకుంటాయని.. విశాఖ పోలీసులు బయటి భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







