కాసేపట్లో విశాఖకు పయనమవ్వనున్న తెలంగాణ దొర
- December 23, 2018
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠాన్ని ఆయన సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న కేసీఆర్..మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శారదాపీఠానికి వెళ్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశీర్వచనం తీసుకుంటారు.
దాదాపు రెండు గంటలసేపు పీఠంలోనే కేసీఆర్ గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు స్వామీజీ ఆధ్వర్యంలో కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇక.. విశాఖ పర్యటన అనంతరం కేసీఆర్.. భువనేశ్వర్ వెళ్తారు.
కేసీఆర్ వ్యక్తిగత భద్రత ఏర్పాట్లను తెలంగాణ నుంచి వచ్చే బలగాలు చూసుకుంటాయని.. విశాఖ పోలీసులు బయటి భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







