యూఏఈ పర్యటనకు రాహుల్..!
- December 24, 2018యూఏఈ:ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ఫలితాలపై సమీక్షలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఎంపికతో తీరికలేకుండా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో యూఏఈ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో ఆదేశంలో పర్యటించనున్నారు. దుబాయ్లో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు వ్యాస్ తెలిపారు. అంతకుముందే ఈ నెలాఖరులో దుబాయ్ వెళ్లి రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు జనసమీకరణకు సన్నాహాలు చేయనున్నట్లు ఆయన వివరించారు.రాహుల్ దుబాయ్ పర్యటన మాత్రం కచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా వ్యాస్ పేర్కొన్నారు. షార్జా వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు యూఏఈలో ఉన్న ప్రవాసులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంతుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు