యూఏఈ పర్యటనకు రాహుల్..!
- December 24, 2018
యూఏఈ:ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ఫలితాలపై సమీక్షలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఎంపికతో తీరికలేకుండా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో యూఏఈ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో ఆదేశంలో పర్యటించనున్నారు. దుబాయ్లో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు వ్యాస్ తెలిపారు. అంతకుముందే ఈ నెలాఖరులో దుబాయ్ వెళ్లి రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు జనసమీకరణకు సన్నాహాలు చేయనున్నట్లు ఆయన వివరించారు.రాహుల్ దుబాయ్ పర్యటన మాత్రం కచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా వ్యాస్ పేర్కొన్నారు. షార్జా వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు యూఏఈలో ఉన్న ప్రవాసులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంతుంది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







