యూఏఈ పర్యటనకు రాహుల్..!
- December 24, 2018
యూఏఈ:ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ఫలితాలపై సమీక్షలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఎంపికతో తీరికలేకుండా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో యూఏఈ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో ఆదేశంలో పర్యటించనున్నారు. దుబాయ్లో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు వ్యాస్ తెలిపారు. అంతకుముందే ఈ నెలాఖరులో దుబాయ్ వెళ్లి రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు జనసమీకరణకు సన్నాహాలు చేయనున్నట్లు ఆయన వివరించారు.రాహుల్ దుబాయ్ పర్యటన మాత్రం కచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా వ్యాస్ పేర్కొన్నారు. షార్జా వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు యూఏఈలో ఉన్న ప్రవాసులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







