అగ్నిపర్వతం పేలుడు ధాటికి సునామీ.. మరో హెచ్చరిక
- December 25, 2018
అగ్నిపర్వతం పేలుడు దాటికి విరుచుకుపడ్డ సునామీ ఇండోనేసియాకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. రాకాసీ అలల ధాటికి వందలాది ఇళ్లు కుప్పకూలాయి . వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చనిపోయిన వారి సంఖ్య 373కు చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆధికారులు ఆందోళన చెందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది స్థానికులే ఉన్నట్లు తెలుస్తోంది. సుమత్రా , జావా దీవుల్లో ఇప్పటికీ 128 మంది జాడ తెలియరాలేదు.
సునామీ ప్రభావిత ప్రాంతాలు భీతావహంగా మారాయి. కుప్పకూలిన భవంతులు, విరిగిపడిన భారీ వృక్షాలు, నేలకూలిన కరెంట్ స్తంభాలతో ఎటు చూసినా దర్శన మిస్తున్నాయి. కన్నీటి సంద్రమైన దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవులు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . శిథిలాలను తొలగిస్తూ, వాటికింద చిక్కుకున్నవారిని కాపాడే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సునామీకి కారణమైన అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది. దీంతో మరో సునామీ విరుచుకుపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







