అగ్నిపర్వతం పేలుడు ధాటికి సునామీ.. మరో హెచ్చరిక
- December 25, 2018
అగ్నిపర్వతం పేలుడు దాటికి విరుచుకుపడ్డ సునామీ ఇండోనేసియాకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. రాకాసీ అలల ధాటికి వందలాది ఇళ్లు కుప్పకూలాయి . వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చనిపోయిన వారి సంఖ్య 373కు చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆధికారులు ఆందోళన చెందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది స్థానికులే ఉన్నట్లు తెలుస్తోంది. సుమత్రా , జావా దీవుల్లో ఇప్పటికీ 128 మంది జాడ తెలియరాలేదు.
సునామీ ప్రభావిత ప్రాంతాలు భీతావహంగా మారాయి. కుప్పకూలిన భవంతులు, విరిగిపడిన భారీ వృక్షాలు, నేలకూలిన కరెంట్ స్తంభాలతో ఎటు చూసినా దర్శన మిస్తున్నాయి. కన్నీటి సంద్రమైన దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవులు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . శిథిలాలను తొలగిస్తూ, వాటికింద చిక్కుకున్నవారిని కాపాడే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సునామీకి కారణమైన అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది. దీంతో మరో సునామీ విరుచుకుపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!