అగ్నిపర్వతం పేలుడు ధాటికి సునామీ.. మరో హెచ్చరిక
- December 25, 2018
అగ్నిపర్వతం పేలుడు దాటికి విరుచుకుపడ్డ సునామీ ఇండోనేసియాకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. రాకాసీ అలల ధాటికి వందలాది ఇళ్లు కుప్పకూలాయి . వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చనిపోయిన వారి సంఖ్య 373కు చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆధికారులు ఆందోళన చెందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది స్థానికులే ఉన్నట్లు తెలుస్తోంది. సుమత్రా , జావా దీవుల్లో ఇప్పటికీ 128 మంది జాడ తెలియరాలేదు.
సునామీ ప్రభావిత ప్రాంతాలు భీతావహంగా మారాయి. కుప్పకూలిన భవంతులు, విరిగిపడిన భారీ వృక్షాలు, నేలకూలిన కరెంట్ స్తంభాలతో ఎటు చూసినా దర్శన మిస్తున్నాయి. కన్నీటి సంద్రమైన దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవులు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . శిథిలాలను తొలగిస్తూ, వాటికింద చిక్కుకున్నవారిని కాపాడే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సునామీకి కారణమైన అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది. దీంతో మరో సునామీ విరుచుకుపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







