అగ్నిపర్వతం పేలుడు ధాటికి సునామీ.. మరో హెచ్చరిక
- December 25, 2018అగ్నిపర్వతం పేలుడు దాటికి విరుచుకుపడ్డ సునామీ ఇండోనేసియాకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. రాకాసీ అలల ధాటికి వందలాది ఇళ్లు కుప్పకూలాయి . వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చనిపోయిన వారి సంఖ్య 373కు చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆధికారులు ఆందోళన చెందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది స్థానికులే ఉన్నట్లు తెలుస్తోంది. సుమత్రా , జావా దీవుల్లో ఇప్పటికీ 128 మంది జాడ తెలియరాలేదు.
సునామీ ప్రభావిత ప్రాంతాలు భీతావహంగా మారాయి. కుప్పకూలిన భవంతులు, విరిగిపడిన భారీ వృక్షాలు, నేలకూలిన కరెంట్ స్తంభాలతో ఎటు చూసినా దర్శన మిస్తున్నాయి. కన్నీటి సంద్రమైన దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవులు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . శిథిలాలను తొలగిస్తూ, వాటికింద చిక్కుకున్నవారిని కాపాడే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సునామీకి కారణమైన అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది. దీంతో మరో సునామీ విరుచుకుపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు