ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి
- December 25, 2018
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. అన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రీస్తు ప్రభోదించిన బైబిల్ను ప్రతి ఒక్కరూ చదవి క్రీస్తు బోధనలను పాటించాలని చర్చ్ ఫాదర్లు సూచించారు. ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. శాంతియుత మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. క్రీస్తు జననాన్ని, త్యాగాన్ని గుర్తు చేశారు. ఇక.. దేశ వ్యాప్తంగా అన్ని చర్చిలు విద్యుత్ కాంతులు, క్రిస్మస్ ట్రీలతో ధగధగలాడుతున్నాయి.
ఇక.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి జన సంద్రమైంది. కరుణామయుడి కటాక్షం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఆధ్వర్యంలో దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థన అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు.
తాజా వార్తలు
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







