శ్రీదేవి కోసమే ఆ సినిమా చూసాం అంటున్న అభిమానులు
- December 25, 2018బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జీరో. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికల పాత్రలు పోషించారు. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ అందుకుని, దేశవ్యాప్తంగా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవిని చివరిసారిగా చూసిన అభిమానులు ఆవేదన చెందారు.
ఈ సినిమాలో శ్రీదేవి అతిథి పాత్రలో కనిపించింది. ఆమె మరణం తర్వాత తొలిసారి తెరపై కనపడటం, ఇదే చివరిసారి కావడంతో అభిమానులు బాధపడ్డారు. శ్రీదేవిని చూడటానికే సినిమాకు వెళ్లినట్లు కొందరు తెలిపారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. 'జీరో'లో శ్రీదేవి ఫొటోలను షేర్ చేశారు. ఇవి కాస్త సోషల్మీడియాలో వైరల్గా మారాయి. 'శ్రీదేవి ఎంత అందంగా ఉన్నారో, శ్రీదేవిని చివరిసారిగా పెద్ద స్క్రీన్పై చూడటానికి సినిమాకు వెళ్లా, ఆమెను చివరిసారి చూసినప్పుడు మొత్తం థియేటర్ మౌనంగా ఉండిపోయింది, 'జీరో'లో శ్రీదేవి నా అంచనాలకు మించి ఓ దేవతలా కనిపించారు, ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయా, శాశ్వతమైన తార శ్రీదేవి కోసం 'జీరో' చూశా, మళ్లీ స్క్రీన్పై శ్రీదేవిని చూడటం బాగుంది, ఆమె సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.. కానీ ఇప్పుడు మనతో లేరు..' అంటూ ట్వీట్లు చేశారు.
తాజా వార్తలు
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్