శ్రీదేవి కోసమే ఆ సినిమా చూసాం అంటున్న అభిమానులు
- December 25, 2018
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జీరో. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికల పాత్రలు పోషించారు. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ అందుకుని, దేశవ్యాప్తంగా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవిని చివరిసారిగా చూసిన అభిమానులు ఆవేదన చెందారు.
ఈ సినిమాలో శ్రీదేవి అతిథి పాత్రలో కనిపించింది. ఆమె మరణం తర్వాత తొలిసారి తెరపై కనపడటం, ఇదే చివరిసారి కావడంతో అభిమానులు బాధపడ్డారు. శ్రీదేవిని చూడటానికే సినిమాకు వెళ్లినట్లు కొందరు తెలిపారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. 'జీరో'లో శ్రీదేవి ఫొటోలను షేర్ చేశారు. ఇవి కాస్త సోషల్మీడియాలో వైరల్గా మారాయి. 'శ్రీదేవి ఎంత అందంగా ఉన్నారో, శ్రీదేవిని చివరిసారిగా పెద్ద స్క్రీన్పై చూడటానికి సినిమాకు వెళ్లా, ఆమెను చివరిసారి చూసినప్పుడు మొత్తం థియేటర్ మౌనంగా ఉండిపోయింది, 'జీరో'లో శ్రీదేవి నా అంచనాలకు మించి ఓ దేవతలా కనిపించారు, ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయా, శాశ్వతమైన తార శ్రీదేవి కోసం 'జీరో' చూశా, మళ్లీ స్క్రీన్పై శ్రీదేవిని చూడటం బాగుంది, ఆమె సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.. కానీ ఇప్పుడు మనతో లేరు..' అంటూ ట్వీట్లు చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







