మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం

- December 25, 2018 , by Maagulf
మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం

ఏపీ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి 3 రోజులపాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆయనకు సింగపూర్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ 6వ అధ్యక్షుడైన ఎస్‌ఆర్‌ నాథన్‌ సేవల్ని స్మరిస్తూ ఇచ్చే ఫెలోషిప్‌ను ఈసారి లోకేష్‌కి ప్రదానం చేస్తున్నారు. దీన్ని అందుకునేందుకు రావాలంటూ లోకేష్‌కు..

సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ నుంచి ఆహ్వానం అందింది. సంవత్సరం పాటు నారా లోకేష్‌కి ఎస్‌ఆర్ నాథన్ ఫెలోషిప్ ఉంటుంది. అటుఈ పర్యటనలో పలువురు సింగపూర్ మంత్రులతో సమావేశం కానున్న లోకేష్.. అమరావతి నిర్మాణం సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com