విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం: చంద్రబాబు
- December 25, 2018
అమరావతి: హాస్టల్లో విద్యార్థుకు కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు... సాధించిన ప్రగతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రియల్టైమ్లో సంక్షేమ కార్యక్రమాల్ని, పథకాల్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. మనం చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయని సీఎం పేర్కొన్నారు. ఆదరణ పథకం కింద పెద్దఎత్తున పనిముట్లను అందిస్తున్నామని, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. సుస్థిర వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
2014 ముందు ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండేవి..? లోటు బడ్జెట్ ఉన్నా ఇప్పుడు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు... అమలు చేస్తున్నామనేది బేరీజువేసుకోవాలని చంద్రబాబు అన్నారు. గరిష్టస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, ఇకముందు కూడా... మెరుగ్గా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయగలమో ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. కొందరు ఇస్తున్న బూటకపు హామీలకన్నా... అమలవుతున్న పథకాలు ఎంతో మెరుగైనవని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







