వెండితెరపై 'మిసైల్ మేన్' బయోపిక్!
- December 26, 2018
బాలీవుడ్లోనేకాదు సౌత్లోనూ ఇప్పుడు బయోపిక్ల సీజన్ నడుస్తోంది. ఆటగాళ్ల లైఫ్ స్టోరీల గురించి రకరకాల సినిమాలు అభిమానులను అలరించాయి. బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో మిసైల్ మేన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్కలాం జీవితం మీద సినిమాని సౌత్తోపాటు హిందీలోనూ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కలాం రోల్లో బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ నటిస్తాడని సమాచారం. కొద్దిరోజుల కిందట ఫిల్మ్ మేకర్స్.. అనిల్కపూర్ని కలిసి స్క్రిప్ట్ వినిపించడం, ఆయనకు నచ్చడంతో ఈ బయోపిక్ చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్పై అఫీషియల్గా ప్రకటన రానుంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్ళడం ఖాయం. అనిల్ సుంకర- అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నారు. కలాం జీవిత చరిత్రపై రాజ్ చెంగప్ప రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కనుంది.
తాజా వార్తలు
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!







