రెండుగా చీలనున్న ఆర్ఆర్ఆర్ !?
- December 28, 2018
'ఆర్ ఆర్ ఆర్' రెండవ షెడ్యూల్ కు రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఒకవైపు కార్తికేయ పెళ్లి వ్యవహారాలను చూసుకుంటూనే మరొకవైపు త్వరలో ప్రారంభం కాబోతున్న 'ఆర్ ఆర్ ఆర్' రెండవ షెడ్యూల్ లో తీయవలసిన సీన్స్ కోసం రాజమౌళి తన టీమ్ మెంబర్స్ తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథ 1930 నుండి 2019 వరకు కొనసాగుతుంది కాబట్టి అనేక ట్విస్ట్ లు ఈకథలో ఉండబోతున్నాయి. దీనితో ఈమూవీ కథకు సంబంధించిన ట్విస్ట్ లలో క్లారిటీ లోపించకుండా అవసరం అనుకుంటే ఈమూవీని కూడ రెండు భాగాలుగా తీయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు టాక్.
ఇప్పటికే ఈ విషయమై రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 'బాహుబలి' రెండు పార్ట్ లలో తీసిన సందర్భంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ట్విస్ట్ ఉన్నట్లుగా 'ఆర్ ఆర్ ఆర్' కథకు సంబంధించి కూడ ప్రేక్షకులను విపరీతంగా ఆలోచింప చేసే ఒక ట్విస్ట్ దొరికితే ఈమూవీని కూడ రెండు పార్ట్స్ గా తీయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు.
దీనికితోడు ఈమూవీని రెండు పార్ట్స్ గా తీయడం వల్ల లాభాలు కూడ విపరీతంగా వస్తాయని అందువల్ల ఈమూవీకి అనుకోకుండా బడ్జెట్ పెరిగినా ఎటువంటి నష్టం ఉండదు అన్న కోణంలో రాజమౌళి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ముగిసేలోగా ఈవిషయం పై ఒక నిర్ణయానికి రావాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే జూనియర్ చరణ్ లు రెండు సంవత్సరాల పాటు రాజమౌళి బంధిఖానాలో ఉండి పోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







