ఆంటీ అంటూ నన్ను ఎవరైనా పిలిస్తే…షూట్ చేయండి: స్మ్రుతి ఇరానీ
- December 28, 2018
ప్రస్తుత కాలంలో చాలామంది యువతులకైనా, యువకులకైనా ఎంత వయసు పెరిగినా కూడా ఆంటీ, అంకుల్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తనకు కూడా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టముండదు అంటూ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఎయిర్ పోర్టులో అనుకోకుండా స్మృతి ఇరానీ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిశారట. దీంతో ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారట. 'జాన్వీ కపూర్ నన్ను ఆంటీ అని సంబోధిస్తూ మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నాక ఆంటీ అని పిలిచినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు నేనేం ఫర్వాలేదు అంటూ సర్ది చెప్పాను. ఈ కాలం పిల్లలు ఉన్నారే… ఆంటీ అంటూ ఎవరైనా పిలిస్తే… ఎవరైనా నన్ను షూట్ చేయండి అని గట్టిగా అరవాలన్పిస్తుంది…' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు స్మృతీ ఇరానీ. ప్రస్తుతం ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో, 'తక్త్' అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!