ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం..
- December 29, 2018
ఫిలిప్పీన్స్ లో ని మిందానావో ద్వీపంలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. మిందానావో ద్వీపంలోని జనరల్ శాంటోస్ అనే నగరానికి 193కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భూకంప కేంద్రానికి 300కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చిరికలు జారీ చేశారు. దీంతో.. సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
తీరప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఫిలప్పీన్స్ తోపాటు ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.
ఇటీవల ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో భారీ సునామి సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







