గగన్యాన్: అంతరిక్షంలోకి భారత్ వ్యోమగాములు
- December 29, 2018ఢిల్లీ : అంతరిక్ష ప్రయోగంలో మరో ముందడుగు పడింది. ఎన్నాళ్లో పెండింగ్లో ఉన్న గగన్యాన్ ప్రయోగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 'గగన్యాన్' ప్రయోగానికి రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. డిసెంబర్ 28వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలియచేశారు.
ముగ్గురు భారత వ్యోమగాములు...
మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు భారతీయ వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లనున్నారు. వీరు అంతరిక్షంలో ఏడు రోజులు ఉంటారు. ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2022 నాటికి గగన్యాన్ ప్రయోగాన్ని చేసి తీరుతామని గతంలోనే ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు. 2022 నాటికి భారతీయులను అంతరిక్షంలోకి పంపుతామని ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, రష్యా, చైనా ఇలాంటి ప్రయోగాలు జరిపింది. ఈ ప్రయోగాన్ని ISRO సక్సెస్ చేస్తే ఇండియా నాలుగో దేశంగా కీర్తిపుటల్లో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?