గగన్యాన్: అంతరిక్షంలోకి భారత్ వ్యోమగాములు
- December 29, 2018
ఢిల్లీ : అంతరిక్ష ప్రయోగంలో మరో ముందడుగు పడింది. ఎన్నాళ్లో పెండింగ్లో ఉన్న గగన్యాన్ ప్రయోగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 'గగన్యాన్' ప్రయోగానికి రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. డిసెంబర్ 28వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలియచేశారు.
ముగ్గురు భారత వ్యోమగాములు...
మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు భారతీయ వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లనున్నారు. వీరు అంతరిక్షంలో ఏడు రోజులు ఉంటారు. ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2022 నాటికి గగన్యాన్ ప్రయోగాన్ని చేసి తీరుతామని గతంలోనే ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు. 2022 నాటికి భారతీయులను అంతరిక్షంలోకి పంపుతామని ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, రష్యా, చైనా ఇలాంటి ప్రయోగాలు జరిపింది. ఈ ప్రయోగాన్ని ISRO సక్సెస్ చేస్తే ఇండియా నాలుగో దేశంగా కీర్తిపుటల్లో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







