ప్రముఖ దర్శకుడి కన్నుమూత
- December 30, 2018
కోల్కతా: ఇండియన్ సినిమా చూసిన అత్యున్నత దర్శకుల్లో ఒకరైన బెంగాలీ డైరెక్టర్ మృనాల్ సేన్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఉదయం పదిన్నర గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. మృనాల్ సేన్ వయసు 95 ఏళ్లు. మృనాల్ సేన్కు 2005లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఫరీద్పూర్లో మృనాల్ జన్మించారు. 1956లో రాత్ భోర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆకాశ్ కుసుమ్ (1965), భువన్ షోమ్ (1969), కలకత్తా 71, ఇంటర్వ్యూ (1971), ఖాందహార్ (1974), కోరస్ (1975), మృగయ (1977), అకలేర్ సాంధనె (1981), ఏక్ దిన్ అచానక్ (1989)లాంటి సినిమాలను ఆయన తెరకెక్కించారు. 2002లో వచ్చిన ఆమర్ భువన్ మృనాల్ సేన్ చివరి సినిమా.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







