'పేట' తెలుగు ట్రైలర్
- January 02, 2019
హైదరాబాద్: సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పేట' తెలుగు ట్రైలర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తమిళ ట్రైలర్కు విశేష స్పందన లభించింది. 'ఇరవై మందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమేశాడు' అని ఓ వ్యక్తి చెబుతున్నప్పుడు రజనీని వెనక నుంచి చూపించిన సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. 'చూస్తావ్గా.. ఈ కాళీ ఆడించే ఆట' అని రజనీ డైలాగ్ చెప్పే విధానం ఆకట్టుకుంటోంది. 'చూడ్డానికి చిన్నపిల్లాడిలా చాలా స్టైల్గా ఉన్నారు' అని మేఘా ఆకాశ్..రజనీని చూసి చెబుతున్న డైలాగ్ బాగుంది. కొందరు రౌడీలు తలైవాను కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన బల్లపై ఎక్కి స్టైల్గా కూర్చుని నవ్వుతూ..'నిజం చెబుతున్నాను.. కొట్టి అండర్వేర్తో పరిగెత్తిస్తాను..పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో..' అని చెబుతున్న డైలాగ్ హైలైట్గా నిలిచింది.
ఇందులో సిమ్రన్, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నవాజుద్దిన్ సిద్ధిఖి, బాబీ సింహా, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







