'పేట' తెలుగు ట్రైలర్
- January 02, 2019
హైదరాబాద్: సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పేట' తెలుగు ట్రైలర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తమిళ ట్రైలర్కు విశేష స్పందన లభించింది. 'ఇరవై మందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమేశాడు' అని ఓ వ్యక్తి చెబుతున్నప్పుడు రజనీని వెనక నుంచి చూపించిన సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. 'చూస్తావ్గా.. ఈ కాళీ ఆడించే ఆట' అని రజనీ డైలాగ్ చెప్పే విధానం ఆకట్టుకుంటోంది. 'చూడ్డానికి చిన్నపిల్లాడిలా చాలా స్టైల్గా ఉన్నారు' అని మేఘా ఆకాశ్..రజనీని చూసి చెబుతున్న డైలాగ్ బాగుంది. కొందరు రౌడీలు తలైవాను కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన బల్లపై ఎక్కి స్టైల్గా కూర్చుని నవ్వుతూ..'నిజం చెబుతున్నాను.. కొట్టి అండర్వేర్తో పరిగెత్తిస్తాను..పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో..' అని చెబుతున్న డైలాగ్ హైలైట్గా నిలిచింది.
ఇందులో సిమ్రన్, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నవాజుద్దిన్ సిద్ధిఖి, బాబీ సింహా, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







