'పేట' తెలుగు ట్రైలర్
- January 02, 2019
హైదరాబాద్: సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పేట' తెలుగు ట్రైలర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తమిళ ట్రైలర్కు విశేష స్పందన లభించింది. 'ఇరవై మందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమేశాడు' అని ఓ వ్యక్తి చెబుతున్నప్పుడు రజనీని వెనక నుంచి చూపించిన సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. 'చూస్తావ్గా.. ఈ కాళీ ఆడించే ఆట' అని రజనీ డైలాగ్ చెప్పే విధానం ఆకట్టుకుంటోంది. 'చూడ్డానికి చిన్నపిల్లాడిలా చాలా స్టైల్గా ఉన్నారు' అని మేఘా ఆకాశ్..రజనీని చూసి చెబుతున్న డైలాగ్ బాగుంది. కొందరు రౌడీలు తలైవాను కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన బల్లపై ఎక్కి స్టైల్గా కూర్చుని నవ్వుతూ..'నిజం చెబుతున్నాను.. కొట్టి అండర్వేర్తో పరిగెత్తిస్తాను..పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో..' అని చెబుతున్న డైలాగ్ హైలైట్గా నిలిచింది.
ఇందులో సిమ్రన్, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. నవాజుద్దిన్ సిద్ధిఖి, బాబీ సింహా, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







