బ్రిడ్జిపై రైలు ప్రమాదం
- January 02, 2019డెన్మార్క్ లో ఈ ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జిపై జరిగిన రైలు ప్రమాదంలో పలువురు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మరో ఎనిమిది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. అధికారిక ప్రకటన మేరకు మృతుల సంఖ్య ఆరుగా చెబుతున్నారు. కానీ అనధికారిక కథనాల మేరకు ఈ సంఖ్య పదికి పైనే ఉండొచ్చని తెలిసింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి మధ్య డానిష్ దీవులైన జీల్యాండ్, ఫునెన్ లను కలుపుతుంది. డానిష్ మీడియా కథనం ప్రకారం బలంగా వీస్తున్న చలిగాలుల కారణంగా ఓ గూడ్సు రైలుపై టార్పాలిన్ విడిపోయి అందులోని కంటెయినర్లు ఎగురుతూ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలుపై వచ్చిపడ్డాయి. దీంతో దారి కనపడక హఠాత్తుగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ