హీరా గ్రూప్ స్కాం అప్డేట్
- January 03, 2019
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వేల కోట్ల డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ను ఇవాళ ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మరి కొద్ది సేపట్లో చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.
అనేక స్కీముల పేరుతో వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడటమే కాకుండా.. నౌహీరా సారథ్యంలోని హీరా గ్రూప్నకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. హీరా గ్రూప్లో ఉగ్రవాదులకు సంబంధించిన డిపాజిట్లు ఉన్నాయని.. ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు.
దేశవ్యాప్తంగా నౌహీరా మోసాలు ఉండటమే కాకుండా పలు బ్యాంకు ఖాతాలను కూడా నిర్వహించారని.. విదేశాల్లో కూడా ఈమెకు బ్యాంకు ఖాతాలు ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారాన్ని ఏపీ సీఐడీ కోరింది. 8 విదేశీ బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయల లావాదేవీలను హీరా గ్రూప్ నిర్వహించినట్లు తేలింది. ఇప్పటి వరకు సీఐడీ దర్యాప్తులో హీరా గ్రూప్ స్కాం విలువ 8 వేల కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనాకు వచ్చారు.
మరోవైపు హీరా గ్రూప్ ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించి నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాం వెనుక రాజకీయ నాయకులు హస్తం కూడా ఉండే అవకాశం లేకపోలేదని.. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం నౌహీరా కస్టడీని పోలీసులు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా