సెన్సార్ పూర్తి చేసుకున్న "ఎన్టీఆర్-కథానాయకుడు"..9న గ్రాండ్ గా విడుదల..!!
- January 05, 2019నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఎన్టీఆర్-కథానాయకుడు" చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని 'U' సర్టిఫికేట్ ని పొందింది.. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల యాభై నిమిషాల నిడివితో చిత్రం జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.. విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి , సుమంత్, కళ్యాణ్ రామ్ తదితరులు చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో మంచి స్పందన దక్కించుకోగా సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..