అరుదైన రికార్డు సాధించిన '2.ఓ' సినిమా
- January 05, 2019
ఒకప్పుడు తమ అభిమాన కథానాయకుడి సినిమా చూసేందుకు.. జనం థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. కానీ.. పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడు థియేటర్ల దగ్గర కంటే ఆన్లైన్లోనే టిక్కెట్లకు కాంపిటేషన్ పెరిగింది. సినిమా విడుదలకు మూడు, నాలుగు రోజుల ముందే నెట్లో టిక్కెట్లు బుక్ చేసుకునే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఇండియాలో సినిమా టిక్కెట్లు విక్రయించే ఆన్లైన్ పోర్టల్స్లో బుక్ మై షో ఒకటి. అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే 2018 సంవత్సరంలో సినిమా టిక్కెట్ల బుకింగ్ పెరిగినట్టు ఈ సంస్థ ప్రకటించింది. పోయినేడాది ఈ సంస్థ పలు భాషలకు సంబంధించి ఏకంగా 1780 సినిమాల టిక్కెట్లను విక్రయించిందట. అన్ని సినిమాల్లోకెల్లా అత్యధికంగా టికెట్లు అమ్ముడు పోయిన సినిమా '2.ఓ' అని సదరు సంస్థ ప్రకటించింది. '2.ఓ' చిత్రం బుకింగ్స్ ఓపెన్ చేయగానే అన్ని భాషలకు కలిపి సెకనుకు 16 టికెట్ల చొప్పున అమ్ముడు పోయి సరికొత్త రికార్డు సృష్టించిందట.
2018వ సంవత్సరానికిగానూ బుక్ మై షో టిక్కెట్ల విక్రయాల్లో '2.0' తర్వాత రెండవ స్థానంలో 'పద్మావత్' చిత్రం నిలిచింది. ఇక గత ఏడాది ఈ సంస్థ విక్రయించిన టిక్కెట్లలో మొదటి స్థానంలో హిందీ చిత్రాలు నిలవగా రెండో స్థానాన్ని తెలుగు చిత్రాలు ఆక్రమించాయట. ఆ తర్వాత మూడవ స్థానంలో ఇంగ్లీష్ సినిమాలున్నాయి. మొత్తంమీద 2018వ సంవత్సరానికి బుక్ మై షో పోర్టల్లో '2.ఓ' టాప్ ప్లేసులో నిలవగా 2019లో ఏ చిత్రం ఆ అవకాశాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







