ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం
- January 06, 2019
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర బదాఖ్షాన్ ప్రావిన్స్లోని ఓ బంగారం గని కూలడంతో 30 మంది కార్మికులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్లంతా గనిలో పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 20 మంది వరకు గాయపడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇలా గనులు కూలడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. స్థానిక గ్రామస్థులు బంగారం కోసమని నదీ తీరంలో 60 మీటర్ల లోతు వరకు గని తవ్వారు. అందులోకి వెళ్లి బంగారం కోసం అన్వేషిస్తుండగా గని కూలింది. ఈ గనిని తవ్విన వాళ్లు ప్రొఫెషనల్స్ కాకపోవడం వల్ల అది కూలి ఉంటుందని ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి నిక్ మొహ్మద్ నజారీ చెప్పారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇక్కడి గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్రమంగా గనులు తవ్వి బంగారం కోసం అన్వేషిస్తున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







