సామూహిక నిరాహార దీక్షకు పాలస్తీనా ఖైదీలు సిద్ధం
- January 08, 2019జెరూసలేం : జైళ్ళలో పరిస్థితులను మరింత అధ్వాన్నం చేసేలా కొత్త చర్యలు చేపట్టాలని ఇజ్రాయిల్ ప్రభుత్వం భావిస్తోంది. అదే గనుక జరిగితే మూకుమ్మడిగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇజ్రాయిల్ జైళ్ళు, నిర్బంధ కేంద్రాలు, ఇంటరాగేషన్ కేంద్రాల్లోని వందలాదిమంది పాలస్తీనియన్లు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఖైదీలు, పాలనాపరమైన నిర్బంధితులు (ఎలాంటి అభియోగాలు లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నవారు) ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కొత్త తరహా అణచివేత చర్య అని వారు వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తీసుకోవడమంటే యుద్ధం ప్రకటించడమేనని, దీంతో తమ పోరాటంలో కొత్త దశ ఆరంభమైందని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. తమకు సంఘీభావంగా నిలబడాల్సిందిగా వారు పాలస్తీనా వర్గాలను, కార్యకర్తలను కోరారు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. ఇజ్రాయిల్లో 5500 పాలస్తీనా ఖైదీలు వున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..