రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

- January 09, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

మస్కట్‌: ఇద్దరు ఒమనీ మహిళలు, సలాలాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సలాలా విలాయత్‌, అల్‌ రిబత్‌ స్ట్రీట్‌లో మంగళవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగిందనీ, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వుందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. కాగా, దోఫార్‌ మునిసిపాలిటీ అధికారులు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో బ్యారియర్‌ నిర్మించాల్సిన అవసరం వుందని ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది. మినిస్ట్రర్‌ ఆఫ్‌ స్టేట్‌, గవర్నర్‌ ఆఫ్‌ దోఫార్‌ ఇప్పటికే సుప్రీమ్‌ కౌన్సిల్‌ ఫర్‌ ప్లానింగ్‌, అలాగే సంబంధిత అథారిటీస్‌కి కాంక్రీట్‌ బారియర్‌ విషయమై తెలియజేశారనీ, రిబత్‌ స్ట్రీట్‌ సెంటర్‌ ఐలాడ్‌ ప్రాముఖ్యతను తెలియజేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com