KGF దర్శకుడితో ప్రభాస్
- January 10, 2019
ప్రభాస్లో భారీ సినిమాలు తీసేందుకు అనేక నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. సాహో. ఈ ఏడాదిలో రానుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లుగా తేల్చారు. మరో పిరియాడికల్ లవ్ స్టోరీ సినిమాలో కూడా నటిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తవుతాయి. ఆ తర్వాత ఆయన కమిట్మెంట్ ఏమిటనేది స్పష్టం కాలేదు.
బాహుబలి ప్రేరణలో కన్నడలో తీసిన కేజీఎఫ్ మంచి విజయం పొందింది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్కు మంచి పేరు వచ్చింది. పరిమిత వ్యయంతో సినిమాలు తీసే కన్నడ భాషలో ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం తీసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. అందుకే ప్రశాంత్తో సినిమా చేసేందుకు పలువురు స్టార్స్ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. తాజాగా ప్రశాంత్, ప్రభాస్ కలయికలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందట. గతంలో దిల్ రాజు సంస్థలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో ప్రభాస్ నటించారు. మళ్లి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







