తమిళనాడులో ఫ్యాన్స్ వార్
- January 10, 2019తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఏకంగా ఒకరిపై ఒకరు కత్తులతో పొడుచుకునే స్థాయి వరకు వెళ్లింది అభిమానుల గొడవ. ఇవాళ పొంగల్ కానుకగా రజనీకాంత్ నటించిన పేట సినిమా.. అజిత్ నటించిన విశ్వాసం సినిమా విడుదలయ్యాయి. దీంతో తమిళనాడులో ఇద్దరు హీరోల అభిమానుల గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పలు చోట్ల ఫ్యాన్స్ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
వేలూరులోని రోహిణి థియేటర్ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో నలుగురు పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్ అంటూ దాడులకు తెగబడ్డారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14