పోలీస్ అధికారులపై దాడి: ఇద్దరు హౌస్ మెయిడ్స్కి జైలు
- January 10, 2019హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు హౌస్మెయిడ్స్కి ఏడాది జైలు శిక్ష విధించింది. మహిళా పోలీస్ అధికారిపై ఈ ఇద్దరు మహిళలు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. న్యాయస్థానం ఈ మేరకు నిందితులకు జైలు శిక్ష విధించడం జరిగింది. నిందితుల్లో ఒకరు ఆసియాకి చెందిన వ్యక్తి కాగా మరొకరు, ఇథియోపియాకి చెందిన వ్యక్తి. రెసిడెన్స్ స్టేటస్పై విచారణ చేస్తుండగా మహిళా అధికారిపై వీరు దాడి చేశారు. ఇద్దరూ అక్రమంగా కింగ్డమ్లో నివసిస్తున్నారు. ఇథియోపియన్ మహిళ ఓ అధికారపై దాడి చేయగా, ఆసియాకి చెందిన మరో మహిళ, ఇతర మహిళా అధికారులపై దాడికి దిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. నిందితులు, బాధిత మహిళా అధికారిని, ఇతర అధికారుల్ని దుర్భాషలాడారు. నిందితులకు జైలు శిక్ష అనంతరం, వారిని డిపోర్టేషన్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ