అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ రెడీ
- January 14, 2019దోహ : అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ సన్నద్ధమ వుతోంది. ప్రస్తుతమున్న 30బిలియన్ డాలర్ల ( రూ.21,11,40,00,00,000) పెట్టుబడిని రానున్న రెండేండ్లలో 45బిలియన్ డాలర్లకు ( రూ.31,67,10,00,00,000) చేర్చాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు ఖతార్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ సీఈవో మన్సూర్ బిన్ ఇబ్రహీమ్ తెలిపారు. ఖతార్ పర్యటలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియోతో భేటీ ఆయన తర్వాత ఇబ్రహీమ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఈయూతో సమానంగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థనీ రాజకీయ, రక్షణ సంబంధిత వ్యవహారాలపై పోంపియోతో సుదీర్ఘంగా చర్చించారని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఆయన ఉద్ఘాటించారు. గతనెలలో అమెరికాలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, ప్రస్తుతం ఖతార్లో చర్చలు నిర్వహించామని అన్నారు. అమెరికాతో విద్య, రక్షణ,సాంకేతిక పరిజ్ఞానం, శక్తివనరులు, పరస్పర సహకారం, ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి