జెట్ఎయిర్వేస్ను ఆదుకోనున్న ఎతిహాద్ ఎయిర్లైన్స్
- January 14, 2019
ముంబై:కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు ఎతిహాద్ కీలక చర్యలు చేపట్టింది. జెట్ ఎయిర్వేస్లో తన వాటాను 49శాతానికి పెంచుకోవాలని ఎతిహాద్ ఎయిర్వేస్ పీజేఎస్సీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఛైర్మన్ నరేష్ గోయల్ తన వాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో నరేష్ గోయల్కు 51శాతం వాటా ఉంది. ఈ డీల్ అనంతరం ఆయన వాటా 20శాతం కంటే దిగువకు పడిపోనుంది. దీంతోపాటు ఆయనకు 10శాతం ఓటింగ్ హక్కులు లభించనున్నాయి. దీనిపై ఇరువర్గాల నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.
మరోపక్క మార్కెట్లో జెట్ ఎయిర్వేస్ షేర్లు 19శాతం లాభపడ్డాయి. నవంబర్ 15 నుంచి ఇప్పటి వరకు ఈ షేర్ కౌంటర్లో వచ్చిన అతిపెద్ద లాభం ఇదే. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్లైనర్గా పేరొందిన జెట్ ఎయిర్వేస్ గత 11ఏళ్లలో 9 సంవత్సరాలు నష్టాలనే చవిచూసింది. ప్రస్తుతం ఎతిహాద్కు మొత్తం 24శాతం వాటాలు ఉన్నాయి. భారత్కు చెందిన ఎయిర్లైన్స్ సంస్థలో విదేశీ సంస్థలు 49శాతం మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
దీంతో ఎతిహాద్ ఆమేరకు వాటాలను కొనుగోలు చేయనుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!