జెట్ఎయిర్వేస్ను ఆదుకోనున్న ఎతిహాద్ ఎయిర్లైన్స్
- January 14, 2019
ముంబై:కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు ఎతిహాద్ కీలక చర్యలు చేపట్టింది. జెట్ ఎయిర్వేస్లో తన వాటాను 49శాతానికి పెంచుకోవాలని ఎతిహాద్ ఎయిర్వేస్ పీజేఎస్సీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఛైర్మన్ నరేష్ గోయల్ తన వాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో నరేష్ గోయల్కు 51శాతం వాటా ఉంది. ఈ డీల్ అనంతరం ఆయన వాటా 20శాతం కంటే దిగువకు పడిపోనుంది. దీంతోపాటు ఆయనకు 10శాతం ఓటింగ్ హక్కులు లభించనున్నాయి. దీనిపై ఇరువర్గాల నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.
మరోపక్క మార్కెట్లో జెట్ ఎయిర్వేస్ షేర్లు 19శాతం లాభపడ్డాయి. నవంబర్ 15 నుంచి ఇప్పటి వరకు ఈ షేర్ కౌంటర్లో వచ్చిన అతిపెద్ద లాభం ఇదే. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్లైనర్గా పేరొందిన జెట్ ఎయిర్వేస్ గత 11ఏళ్లలో 9 సంవత్సరాలు నష్టాలనే చవిచూసింది. ప్రస్తుతం ఎతిహాద్కు మొత్తం 24శాతం వాటాలు ఉన్నాయి. భారత్కు చెందిన ఎయిర్లైన్స్ సంస్థలో విదేశీ సంస్థలు 49శాతం మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
దీంతో ఎతిహాద్ ఆమేరకు వాటాలను కొనుగోలు చేయనుంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా