శబరిమలలో మకరజ్యోతి దర్శనం
- January 14, 2019కేరళ:శబరిమల వాసుడు అయ్యప్పదేవుడి సన్నిధిలో కీలక ఘట్టం షురూ అయింది. ఇవాళ జ్యోతి దర్శనం కోసం శబరిమల కొండల్లో అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మరికాసేపట్లో ఆవిష్కృతం కానున్న జ్యోతి దర్శనం కోసం భక్తకోటి తపిస్తోంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు దక్షిణాది రాష్ట్రాలనుంచి భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు, సామాన్య భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. (జనవరి14వ తేదీ సొమవారం) సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు జరిగే మకరజ్యోతి దర్శనం కోసం పంపానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది. కాగా, రెండు రోజుల క్రితమే పంధాలం నుండి వచ్చిన అయ్యప్ప స్వామి తిరువాభరణాలను సాయంత్రం 6గంటలకు 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. అనంతరం తిరువాభరణం ఘట్టం జరుగుతుంది. తిరువాభరణం ఘట్టాన్ని, జ్యోతి దర్శనాన్ని చూసేందుకు నలుమూలలనుంచి సుమారు 18 మంది లక్షల మంది శబరిమలవాసుని సన్నిధికి చేరుకున్నారని సమాచారం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు