మస్కట్లో న్యూ ఇండియన్ స్కూల్ త్వరలో ప్రారంభం
- January 16, 2019
మస్కట్: ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ - బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఇండియన్ స్కూల్ బౌషర్ హేండోవర్ కార్యక్రమం జరిగింది. క్యాపిటల్ ఏరియాలో ఇది ఏడవ ఇండియన్ స్కూల్ కాగా, ఒమన్ సుల్తానేట్లో మొత్తంగా ఇది 21వది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్కూల్ మెరుగైన విద్యను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్ సామ్యుయేల్ మాట్లాడుతూ, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని ఈ స్కూల్లో అందిస్తున్నట్లు తెలిపారు. స్విమ్మింగ్, స్ప్లాష్ పూల్స్, వెల్నెస్ సెంటర్, వరల్డ్ స్టాండర్డ్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, సైకిలింగ్ ట్రాక్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ కోర్ట్, క్రికెట్ పిచ్చ, కబడ్డి ప్లే ఏరియా వంటి సౌకర్యాలు ఈ స్కూల్లో ఏర్పాటు చేశారు. అత్యున్నత లైబ్రరీలు, మోడ్రన్ ఎమినిటీస్, మ్యూజిక్ రూమ్, రిసోర్స్ సెంటర్, స్టెమ్ లేబరేటరీస్, రోబోటిక్స్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ లెర్నింగ్, కిండర్గార్టెన్ ప్లే ఏరియా కూడా వున్నాయిక్కడ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







