ఇండియాకి ప్రమోషనల్ రేట్స్ ప్రకటించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
- January 18, 2019బహ్రెయిన్ నుంచి కోజికోడ్, కోచి, తిరువనంతపురం మరియు మంగళూరుకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 'ఆల్ ఇంక్లూజివ్' ప్రమోషనల్ ఫేర్స్ని ప్రకటించింది. జనవరి 17 నుంచి 23 మధ్య టిక్కెట్లను బుక్ చేసుకుని జనవరి 17 నుంచి మార్చి 30 లోపు ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బహ్రెయిన్ నుంచి కోచి ప్రయాణానికి 47 బహ్రెయినీ దినార్స్ నుంచి ధరలు మొదలవుతాయి. బహ్రెయిన్ నుంచి కోజికోడ్కి టిక్కెట్ ధరలు 52 బహ్రెయినీ దినార్స్, బహ్రెయిన్ నుంచి మంగళూరుకి 62 బహ్రెయినీ దినార్స్ నుంచి టిక్కెట్ ధరలు వుంటాయి. వీటితోపాటుగా 30 కిలోలల ఉచిత బ్యాగేజీ అలవెన్స్ని కూడా అందించనుంది. ప్రయాణీకులకు 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీని అందిస్తారు. 5 కిలోల అదనపు బ్యాగేజీని 8 బహ్రెయినీ దినార్స్ చెల్లించి తీసుకెళ్ళొచ్చు. 25 బోయింగ్ 737-800 ఎన్జి విమానాల్ని కలిగి వున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 13 అంతర్జాతీయ 20 డొమెస్టిక్ డెస్టినేషన్స్ని కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..