ఆర్థిక సంక్షోభం..స్తంభించిన ప్రభుత్వ కార్యకలాపాలు
- January 20, 2019
వాషింగ్టన్ : ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి నాలుగు వారాలు అవుతోంది. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల మంజూరు విషయంలో అధ్యక్షుడు ట్రంప్కు, అమెరికా కాంగ్రెస్లోని డెమోక్రాట్లకు మధ్య తలెత్తిన వివాదం ప్రభుత్వ ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది. మూడు రోజుల వారాంతపు శలవుల నిమిత్తం డెమోక్రాట్ల నేతృత్వంలోని ప్రతినిధుల సభ సభ్యులు నగరం వీడి వెళ్ళారు. వారు మంగళవారం వస్తారని శుక్రవారం సెనెట్ సమావేశమవుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. రిపబ్లికన్ల అదుపులో గల సెనెట్ సభ్యులు ఇటీవల కాలంలో ప్రతినిధుల సభ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించలేదు. దాంతో కార్యకలాపాల నిర్వహణకు అవససరమైన నిధుల కొరత ఏర్పడింది. అమెరికా చరిత్రలోనే ఇంతకాలమూ ఇలా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడం జరగలేదు. ఇది పరిష్కారం కావడానికి మరో వారం పట్టేలా వుంది.
అంటే 8లక్షల మంది ఉద్యోగులు మరో వారం రోజుల పాటు జీతాలు అందక ఇబ్బందులు పడాల్సి వుంటుంది. శుక్రవారం నుండి ప్రభుత్వ విమాన సర్వీసులు కూడా నిలిపివేశారు. వైట్హౌస్ అనుమతి లేకుండా, చట్టసభల ప్రతినిధులు పర్యటనలు జరపకుండా వుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తలెత్తిన వివాదం పరిష్కారమవకుండా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు విమానాన్ని అందచేసేందుకు ప్రభుత్వం తిరస్కరించింది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







