రెండోసారి భేటీ కానున్న ట్రంప్-కిమ్
- January 20, 2019
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫిబ్రవరి చివరిలో రెండోసారి సమావేశం కానున్నారని వైట్హౌస్ మీడియా కార్యదర్శి సారా సాండెర్స్ తెలిపారు. దాదాపు గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో అణునిరాధీయుకరణఫై చర్చిస్తారని, ఈ సమావేశ వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. . ట్రంప్తో ఉత్తరకొరియా అధికార పార్టీ కొరియన్ వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కిమ్ యంగ్ చోల్ సామవేశం ముగిసిన వెంటనే వైట్హౌస్ ఈ ప్రకటన చేయడం విశేషం. వాషింగ్టన్లోని డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం రాత్రి చేరుకున్న చోల్ శుక్రవారం ఉదయం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంప్పియోతో సమావేశమయ్యారు. కాగా, గత ఏడాది జూన్లో సింగ్పూర్లో ట్రంప్-కిమ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే మరోసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కిమ్ ఇటీవల చైనాలో పర్యటించిన సందర్భంలోనూ అమెరికా అధ్యక్షుడితో సమావేశం గురించి పేర్కొన్నారు. ఈ నెల 2న ట్రంప్ మాట్లాడుతూ కిమ్తో సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







