రెండోసారి భేటీ కానున్న ట్రంప్-కిమ్
- January 20, 2019
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫిబ్రవరి చివరిలో రెండోసారి సమావేశం కానున్నారని వైట్హౌస్ మీడియా కార్యదర్శి సారా సాండెర్స్ తెలిపారు. దాదాపు గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో అణునిరాధీయుకరణఫై చర్చిస్తారని, ఈ సమావేశ వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. . ట్రంప్తో ఉత్తరకొరియా అధికార పార్టీ కొరియన్ వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కిమ్ యంగ్ చోల్ సామవేశం ముగిసిన వెంటనే వైట్హౌస్ ఈ ప్రకటన చేయడం విశేషం. వాషింగ్టన్లోని డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం రాత్రి చేరుకున్న చోల్ శుక్రవారం ఉదయం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంప్పియోతో సమావేశమయ్యారు. కాగా, గత ఏడాది జూన్లో సింగ్పూర్లో ట్రంప్-కిమ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే మరోసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కిమ్ ఇటీవల చైనాలో పర్యటించిన సందర్భంలోనూ అమెరికా అధ్యక్షుడితో సమావేశం గురించి పేర్కొన్నారు. ఈ నెల 2న ట్రంప్ మాట్లాడుతూ కిమ్తో సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







