రెండోసారి భేటీ కానున్న ట్రంప్-కిమ్
- January 20, 2019
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫిబ్రవరి చివరిలో రెండోసారి సమావేశం కానున్నారని వైట్హౌస్ మీడియా కార్యదర్శి సారా సాండెర్స్ తెలిపారు. దాదాపు గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో అణునిరాధీయుకరణఫై చర్చిస్తారని, ఈ సమావేశ వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. . ట్రంప్తో ఉత్తరకొరియా అధికార పార్టీ కొరియన్ వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కిమ్ యంగ్ చోల్ సామవేశం ముగిసిన వెంటనే వైట్హౌస్ ఈ ప్రకటన చేయడం విశేషం. వాషింగ్టన్లోని డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం రాత్రి చేరుకున్న చోల్ శుక్రవారం ఉదయం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంప్పియోతో సమావేశమయ్యారు. కాగా, గత ఏడాది జూన్లో సింగ్పూర్లో ట్రంప్-కిమ్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే మరోసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కిమ్ ఇటీవల చైనాలో పర్యటించిన సందర్భంలోనూ అమెరికా అధ్యక్షుడితో సమావేశం గురించి పేర్కొన్నారు. ఈ నెల 2న ట్రంప్ మాట్లాడుతూ కిమ్తో సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్