ఆటా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పరమేష్ భీమిరెడ్డి

- January 21, 2019 , by Maagulf
ఆటా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పరమేష్ భీమిరెడ్డి

హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) నూతన అధ్యక్షుడిగా పరమేష్ భీమిరెడ్డి ఎన్నికయ్యారు. 2019-21 సంవత్సరానికి గానూ అధ్యక్షుడిగా ఎన్నికైన భీమిరెడ్డి చేత ప్రస్తుత ఆటా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో లాస్ వేగాస్ లోని వెనీషియా కాన్ఫరెన్స్ సెంటర్ లో అట్టహాసంగా జరిగింది. 2021-23 సంవత్సరానికి గానూ ప్రెసిడెంట్ గా భువనేశ్ రెడ్డి బుజాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. సెక్రటరీగా వేణు సంకినేని, జాయింట్ సెక్రటరీగా శరత్ వేముల, ట్రెజర్ గా రవి పట్లోల్ల, జాయింట్ ట్రెజర్ గా అరవింద్ ముప్లిడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కిరణ్ పాశం ఎన్నికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com