రోగి వ్యాధిపై మిస్‌డయాగ్నసిస్‌: ప్రభుత్వ ఆసుపత్రికి జరీమానా

- January 22, 2019 , by Maagulf
రోగి వ్యాధిపై మిస్‌డయాగ్నసిస్‌: ప్రభుత్వ ఆసుపత్రికి జరీమానా

కువైట్‌ సిటీ: రోగి అనారోగ్యానికి సంబంధించి తప్పుడు డయాగ్నసిస్‌ చేసినందుకుగాను ప్రభుత్వ ఆసుపత్రిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలిక కాంపెన్సేషన్‌ కింద 5001 కువైటీ దినార్స్‌ని పేషెంట్‌కి అందించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లేని అనారోగ్యానికి వైద్య చికిత్స చేయడంతో కొత్త అనారోగ్య సమస్యలు తన క్లయింట్‌కి తలెత్తాయంటూ బాధితుడి తరఫున న్యాయవాది ముబారక్‌ అల్‌ ఖసబ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హాస్పిటల్‌ అలాగే, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌పై తక్షణ ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు న్యాయవాది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com