ఈజిప్టు సైన్యం కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతం
- January 23, 2019
కైరో: ఈజిప్టులోని సినారు ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య రెండు రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగు తున్నాయి. ఈజిప్టు సైన్యం జరిపిన కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతమయ్యారు. 142 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. అలాగే, ఉగ్రవాదుల చేతుల్లో ఏడుగురు సైనికులు మృతిచెందారని ఈజిప్టు సైన్యం మంగళవారం ప్రకటించింది. ఈజిప్టు సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్టు తెలిపింది. అక్రమ చొరబాటుదారులను అరికట్టేందుకు ప్రయత్నిస్తు న్నామని, అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుం టున్నామని సైనికాధికారులు తెలిపారు. వలసదారుల రూపంలో దేశంలోకి ప్రవేశిం చేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని అన్నారు. వీరి దాడులను తిప్పిగొట్టేందుకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. కాగా, ఈజిప్టులో 2017లో ఓ మసీదుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 300 మంది మృతిచెందారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భద్రతాబలగాలు అప్రమ్త మయ్యాయి. సరిహద్దులో భద్రతను పటిష్టం చేశాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







