ఈజిప్టు సైన్యం కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతం
- January 23, 2019
కైరో: ఈజిప్టులోని సినారు ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య రెండు రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగు తున్నాయి. ఈజిప్టు సైన్యం జరిపిన కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతమయ్యారు. 142 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. అలాగే, ఉగ్రవాదుల చేతుల్లో ఏడుగురు సైనికులు మృతిచెందారని ఈజిప్టు సైన్యం మంగళవారం ప్రకటించింది. ఈజిప్టు సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్టు తెలిపింది. అక్రమ చొరబాటుదారులను అరికట్టేందుకు ప్రయత్నిస్తు న్నామని, అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుం టున్నామని సైనికాధికారులు తెలిపారు. వలసదారుల రూపంలో దేశంలోకి ప్రవేశిం చేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని అన్నారు. వీరి దాడులను తిప్పిగొట్టేందుకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. కాగా, ఈజిప్టులో 2017లో ఓ మసీదుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 300 మంది మృతిచెందారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భద్రతాబలగాలు అప్రమ్త మయ్యాయి. సరిహద్దులో భద్రతను పటిష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!