ఈజిప్టు సైన్యం కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతం
- January 23, 2019
కైరో: ఈజిప్టులోని సినారు ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య రెండు రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగు తున్నాయి. ఈజిప్టు సైన్యం జరిపిన కాల్పుల్లో 59 మంది మిలిటెంట్లు హతమయ్యారు. 142 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. అలాగే, ఉగ్రవాదుల చేతుల్లో ఏడుగురు సైనికులు మృతిచెందారని ఈజిప్టు సైన్యం మంగళవారం ప్రకటించింది. ఈజిప్టు సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్టు తెలిపింది. అక్రమ చొరబాటుదారులను అరికట్టేందుకు ప్రయత్నిస్తు న్నామని, అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుం టున్నామని సైనికాధికారులు తెలిపారు. వలసదారుల రూపంలో దేశంలోకి ప్రవేశిం చేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని అన్నారు. వీరి దాడులను తిప్పిగొట్టేందుకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. కాగా, ఈజిప్టులో 2017లో ఓ మసీదుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 300 మంది మృతిచెందారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భద్రతాబలగాలు అప్రమ్త మయ్యాయి. సరిహద్దులో భద్రతను పటిష్టం చేశాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







