'జిప్సి' సింగిల్ ట్రాక్ విడుదల
- January 24, 2019
జీవా హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'జిప్సి'. ఈ సినిమాలోని 'వెరీ వెరీ బ్యాడ్..' అనే సింగిల్ట్రాక్ విడుదల కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఎస్ అంబేద్కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్కే సెల్వకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యుగభారతి, దర్శకుడు రాజుమురుగన్, హీరోగా జీవా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జీవా మాట్లాడుతూ.. ''ఓ గ్రామీణ గాయకుడు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథ. ఆ పర్యటన తర్వాత గొప్ప గాయకుడిగా మారుతాడు. అతను అలా గొప్ప వ్యక్తిగా మారడం వెనుక ఓ ప్రధాన కారణం ఉంది. అదే ప్రేమ!
ఈ కథ చెప్పేటప్పుడే తప్పకుండా నటించాలనిపించింది. ఈ సినిమా కోసం నిజంగానే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు పర్యటించా. అప్పుడే మన భారతదేశం ఎంత అందమైనదో అర్థమైంది. సినిమాలో పూర్తిగా నాతోపాటు ఓ గుర్రం ఉంటుంది.
చిత్రం కోసం భిన్నమైన గెటప్లో నటించా. ప్రేక్షకులకు అది నచ్చుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా విడుదలైన తర్వాత జీవా ఓ లక్కీ హీరో అనే గుర్తింపు వస్తుంది. నా జీవితంలో హిట్ చిత్రంగా మాత్రమే కాకుండా నా సినీ కెరీర్కే ఓ మైలురాయిగా ఇది ఉంటుందని నమ్ముతున్నట్లు'' పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!