బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్‌

- January 24, 2019 , by Maagulf
బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పియూష్‌గోయల్ ప్రవేశపెడతారు. కొద్దిసేపటి క్రితం పియూష్ గోయల్‌కు ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ శాఖలను తాత్కాలికంగా అప్పగించారు. ప్రధాని మోడీ సూచన మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి విధుల్లో చేరే వరకు ఎలాంటి శాఖలు లేని మంత్రిగా అరుణ్ జైట్లీ కేబినెట్‌లో కొనసాగుతారు. కేన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఫిబ్రవరి 1న పియూష్ గోయాల్ ఇంటరిమ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గత ఏడాది కూడా పూర్తి బడ్జెట్‌ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. అపుడు కూడా అరుణ్ జైట్లీ కిడ్నీ చికిత్స కోసం సెలవులో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com