ప్రముఖ దర్శకుడిపై దాడి. పేడనీళ్లు చల్లి..ముఖంపై గుద్ది..
- January 25, 2019ప్రముఖ మలాయాళీ దర్శకుడు ప్రియానందనన్పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడిచేసి, పేడ కలిపిన నీళ్లు చల్లారని ఆయన ఆరోపించారు.
బీజేపీ-ఆరెస్సెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
తన నివాసం నుంచి బయటికి వస్తుండగా పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని తెలిపారు. “బయటకు వెళుతున్న సమయంలో కోందరు దుండగులు
నన్ను వెంబడించి కొట్టి నామీద పేడ నీళ్లు పోసి పారిపోయారని” అని ప్రియానందనన్ మీడియాకు వివరించారు. గతంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఫేస్బుక్లో ఆయన అభ్యంతరకర పోస్టులు పేట్టారు. ఆ పోస్టులపై అప్పట్లో కొంత వివాధం చేలరేగింది. అది జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తనను మానసికంగా దెబ్బతీసేందుకే నాపై దాడులు జరుగుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు.. బీజేపీ-ఆరెస్సెస్ కార్యకర్తలే ఈ దాడి చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆయన ఆరోపణలను కేరళ బీజేపీ ఖండించింది. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రియానందన్పై జరిగిన దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..