భారత ప్రభుత్వం 2019 సంవత్సరానికి పద్మ అవార్డులు ప్రకటన
- January 25, 2019
భారత ప్రభుత్వం 2019 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించింది.
నలుగురికి పద్మవిభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.
విజేతల జాబితాను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది.
ఛత్తీస్గఢ్ కళాకారిణి తీజన్ భాయ్, ప్రజా సంబంధాల విభాగంలో ఇస్మాయిల్ ఒమర్ గుయెల్లె(విదేశీయుడు), వాణిజ్య పారిశ్రామిక రంగంలో అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్, రంగస్థల కళలో బల్వంత్ మోరేశ్వర్ పురందరేలకు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించారు.
పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన 14 మంది ప్రముఖుల్లో సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్(మరణానంతరం), పర్వతారోహకురాలు బచేంద్రిపాల్, ఉన్నారు.
ఈ ఏడాది కేంద్రం 94 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.
ఈ అవార్డుకు తెలంగాణ నుంచి సునీల్ ఛెత్రి(క్రీడలు-ఫుట్బాల్), సిరివెన్నెల సీతారామ శాస్త్రి(సినీ గీత రచయిత) ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కోటాలో యడ్లపల్లి వెంకటేశ్వరరావు(వ్యవసాయరంగం), ద్రోణవల్లి హారిక (క్రీడలు-చెస్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
తక్కువ ఖర్చుతో 118 రకాల పరికరాలను తక్కువ ఖర్చుతో తయారు చేయచ్చని నిరూపించిన జుగాడ్ శాస్త్రవేత్త ఉద్ధవ్ కుమార్ భరలీకి కూడా పద్మశ్రీ ప్రకటించారు.
ఇంకా క్రికెటర్ గౌతం గంభీర్, సినీ నటులు మోహన్ లాల్, మనోజ్ బాజ్పాయ్, ప్రభుదేవా, ఖాదర్ ఖాన్(మరణానంతరం), సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్లను కూడా పద్మశ్రీ వరించింది.
పద్మ అవార్డుల జాబితా...
BBC
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!









