లిమ్కా బుక్లో చంద్రబాబు
- January 28, 2019
విజయవాడ: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా లిమ్కా బుక్లో చోటు దక్కించుకోవడం సంతోషమని, ఇన్నోవేషన్స్లో మనం నెంబర్ వన్ కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు వేసవిలో తాగునీటి సరఫరాపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. కొత్త రేషన్ కార్డులు, స్ప్లిట్ కార్డుల కోసం 55,540 దరఖాస్తులు వచ్చాయని, 7,024 దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు.
వచ్చే నెల 2,3,4 తేదీల్లో 4 లక్షల ఇళ్లలో గృహప్రవేశం చేస్తామని, ఆర్టీజీ డేటాలో ఇంకా పర్ఫెక్షన్ రావాలన్నారు. ల్యాండ్ హబ్, సీఎంఎఫ్ఎస్ వ్యవస్థలు మెరుగుపడ్డాయని సీఎం చెప్పారు. ఆర్టీజీకి, ఆయాశాఖల క్షేత్రస్థాయి పరిశీలనకు అనుసంధానం ఉండట్లేదని, ఆర్టీజీ సమాచార ఆధునికీకరణలో వెనుకబడుతోందని ఆయన పేర్కొన్నారు. వచ్చేనెల 2 లోపు పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లోని టాయిలెట్స్ దరఖాస్తులను పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..