ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు
- January 29, 2019
ఇంటర్ అర్హత ఉన్నవారికి నేరుగా ప్రవేశాలు...అర్హత లేనివారికి ప్రవేశ/ అర్హత పరీక్ష ద్వారా ప్రవేశాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిద్వారా బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత లేనివారు ప్రవేశపరీక్షలో అర్హత ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఏ స్టడీసెంటర్ నుంచైనా కోర్సులో చేరడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించి.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువును మార్చి 28గా నిర్ణయించారు. పరీక్ష ఫీజును కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, 01.06.2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు మాత్రం మూడేళ్ల డిగ్రీలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ విద్యార్హత లేనివారు ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో పరీక్షాకేంద్రాన్ని కూడా ఎంచుకోవాలి. రూ.300 పరీక్ష ఫీజును ఆన్లైన్లో లేదా ఫ్రాంచైజీ సెంటర్లలో రూ.310 చెల్లించి రసీదు తీసుకోవచ్చు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







