మమ్ముట్టితో తొలిసారి సన్నీలియోన్
- January 29, 2019హాట్ బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్ కంటే సౌత్పై ఎక్కువగా ఫోకస్ చేసిందా? అవుననే అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. మోలీవుడ్లో ఈమెకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవల ఓ మొబైల్ షాపు ఓపెనింగ్కి కేరళకు వెళ్లిన సన్నీని చూసేందుకు యూత్ ఓ రేంజ్లో ఎగబడింది. దీన్ని గమనించిన కొందరు ప్రొడ్యూసర్లు.. ఆమె క్రేజ్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో మమ్ముట్టితో 'మధుర రాజా' సినిమా మొదలుపెట్టేశారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సన్నీలియోన్ స్పెషల్సాంగ్ చేస్తోంది. మమ్ముటితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది సన్నీ. ఈ సాంగ్ మూవీకే హైలైట్ అని చెబుతోంది యూనిట్. అందుకు సంబంధించిన పిక్ సోషల్మీడియాలో వైరల్గా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఫిల్మ్ని ఏప్రిల్లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. వైశాఖ్ డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్లో తమిళ నటుడు జై, జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత