తెలంగాణ:సీఎం విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం
- January 30, 2019
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు చేయూతనందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ పథకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ జిల్లా మైనార్టీల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. స్కాలర్ షిప్ కొరకు ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కు, జైన్, పార్సీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఉపకార వేతనంతో పాటు విమాన టికెట్ చార్జీలను సైతం మంజూరు చేస్తారని తెలిపారు. - డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.- జీఆర్ఈ, టోఫెల్, ఐలెట్స్ వంటి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. - విశ్వ విద్యాలయంలో ఆగస్టు-2018 నుంచి 2018 డిసెంబర్ వరకు ప్రవేశం పొందినవారు సంబంధిత వెబ్సైట్లో 2019 జనవరి 27వ తేదీ నుంచి 2019 ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ కార్యాలయంలో నేరుగా గానీ, 96769 89460 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..