ట్రక్కుని ఢీకొన్న కారు: 39 ఏళ్ళ ఎమిరాతి మృతి
- January 31, 2019
4 వీల్ డ్రైవ్ వాహనం, ట్రక్కుని ఢీకొనడంతో 39 ఏళ్ళ ఎమిరేటీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. షార్జాలోని అల్ ధయిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్స్ ఓన్లీ లేన్పై ఎమిరాతి తన వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకోగానే, పెట్రోల్ సిబ్బంది, అంబులెన్స్, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయనీ, అయితే ఎమిరాతి అక్కడికక్కడే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. అతి వేగం, అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అల్ ధయిద్ ఆసుపత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం కారణంగా తీవ్రగాయాలై బ్రెయిన్లో అంతర్గత రక్త స్రావంతో ఎమిరాతి మృతి చెందినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!







