ట్రక్కుని ఢీకొన్న కారు: 39 ఏళ్ళ ఎమిరాతి మృతి
- January 31, 2019
4 వీల్ డ్రైవ్ వాహనం, ట్రక్కుని ఢీకొనడంతో 39 ఏళ్ళ ఎమిరేటీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. షార్జాలోని అల్ ధయిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్స్ ఓన్లీ లేన్పై ఎమిరాతి తన వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకోగానే, పెట్రోల్ సిబ్బంది, అంబులెన్స్, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయనీ, అయితే ఎమిరాతి అక్కడికక్కడే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. అతి వేగం, అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అల్ ధయిద్ ఆసుపత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం కారణంగా తీవ్రగాయాలై బ్రెయిన్లో అంతర్గత రక్త స్రావంతో ఎమిరాతి మృతి చెందినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







