ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారం..ఆదుకునేందుకు రంగంలోకి దిగిన 'అటా'

- January 31, 2019 , by Maagulf
ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారం..ఆదుకునేందుకు రంగంలోకి దిగిన 'అటా'

న్యూజెర్సీ : ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆటా (అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 600 మందికి వారెంట్లు జారీ చేయగా.. 100 మందిని అరెస్టు చేశారు. నకిలీ ఎడ్యుకేషనల్‌ కన్సల్‌టెన్సీ నిర్వహిస్తున్న మరో 8 మందిని కూడా అరెస్టు చేశారు. కాగా, ఆటా లీగల్‌ టీమ్‌ సంబంధిత అటార్నీలను సంప్రదించింది. యూఎస్‌లోని పలు భారతీయ విద్యార్థి సంఘాలతో సమావేశమైంది. ఫర్మింగ్‌టన్‌ యూనివర్సిటీ ఘటనలో చిక్కుకున్న బాధిత తెలుగు విద్యార్థులను బయటకు తెచ్చేందుకు ఇండియన్‌ అంబాసిడర్‌ హర్షవర్ధన్‌ సింఘాల, ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ డాక్టర్‌ స్వాతి విజయ్‌ కులకర్ణిలను ఆటా లీగల్‌ టీమ్‌ సభ్యులు కలిశారు. తదుపరి చేపట్టబోయే చర్యలపై వారితో చర్చించారు. ఇండియన్‌ ఎంబసీకి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని ఆటా ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీమ్‌రెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com